ఇతడు తన అమ్మ తరఫు దూరపు బంధువు "యేసూ గోఖలే"ను ప్రేమించి రిజిస్టరు వివాహం చేసుకున్నాడు. ఒక దళితురాలిని వివాహం చేసుకున్నందుకు ఇతడు సంఘ బహిష్కరణకు గురి అయ్యాడు. అయితే ఇలాంటి విషయాలను ఇతడు ఎన్నడూ లెక్కచేయలేదు. కొంత కాలానికే ఇతని భార్య చనిపోయింది. దానితో ఇతని మనసు విరిగి శాంతి కోసం రాత్రింబవళ్ళు సంగీతంలో మునిగిపోయాడు. 1947లో ఇతడు సుమ అనే వితంతువును వివాహం చేసుకున్నాడు. సుమ తండ్రి మంచి కవి. కవి పుత్రి, కవి పత్ని అయిన సుమకు సహజంగానే కవిత్వం యొక్క ప్రాధాన్యత తెలిసివచ్చింది. విందా వద్ద దాదాపు 100 మంచి కవితలు ఉండడం చూసి ఆమె తాను పొదుపు చేసి కూడబెట్టిన 500 రూపాయలతో 1949లో విందా మొట్టమొదటి కవితల పుస్తకం "స్వేదగంగ"ను ప్రచురించింది. దీని ద్వారా కరందీకర్ ప్రతిభ లోకానికి బహిర్గతమయ్యింది. వీరికి పుట్టిన పిల్లలు కూడా ఒకరిని మించి ఒకరు మేధావులుగా ఎదిగారు[1].
విందా కరందీకర్ భార్య పేరు ఏంటి?
Ground Truth Answers: యేసూ గోఖలేయేసూ గోఖలే
Prediction: